టీడీపీ నేత‌ల‌కు ట్విట్ట‌ర్ ద్వారా స‌మాధానం ఇచ్చిన విజ‌య సాయి || Vijaya Sai Reddy Comments On Lokesh

2019-06-29 386

YCP Parliamentary floor leader Vijaya Sai Reddy serious comments on Lokesh and Devineni Uma by twitter.
#appolitics
#ycp
#tdp
#lokesh
#vijayasaireddy
#twitter

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన ఆరోప‌ణ‌లు చేస్తున్న టీడీపీ నేత‌లు లోకేశ్.. దేవినేని ఉమా పైన వైసీపీ నేత విజ‌య సాయిరెడ్డి మండి ప‌డ్డారు.ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం చేయలేదని ఫైర్ అయ్యారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం తొలిసారి వింటున్నామన్నారు. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ మీద సాయిరెడ్డి ట్వీట్ చేసారు. మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.. అంటూ మండిప‌డ్డారు.